నటుడు హర్షవర్దన్ రాణే తెలుగులో పలు సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. హిందీలో పలు ఆఫర్లు రావడంతో బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నారు హర్షవర్దన్. గతకొంతకాలంగా ఖడ్గం ఫేం కిమ్ శర్మ, హర్షవర్దన్ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఈ ఇద్దరూ ముంబై రోడ్లపై కలిసి తిరుగుతూ కెమెరా కంటికి చిక్కడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని తెలిసింది. తరువాత వారిద్దరు విడిపోయారు. అయితే బ్రేకప్ గురించి ఈ జంట ఇంతవరకు స్పందించలేదు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిమ్తో బ్రేకప్ విషయాన్ని బయటపెట్టారు హర్ష. “ఇందులో దాచడానికి ఏం లేదు. మేము కొన్నాళ్ల పాటు కలిసే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ బంధం ముగిసిపోయింది. తన వ్యవహారశైలి, ఆలోచనా విధానమే ఆమె నుంచి నన్ను దూరం చేసింది. కిమ్తో గడిపిన సమయం జీవితంలో అత్యంత మధుర ఙ్ఞాపకాలను మిగిల్చింది. తనకు చాలా హాస్యచతురత ఉంది. నాకు తెలిసి నా డీఎన్ఏలోనే ఏదో తప్పు జరిగింది. ఏ కారణం లేకుండా ఎవరూ విడిపోరు. 12 ఏళ్ల పాటు నేను ఒంటరిగానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు రాణే. కాగా తెలుగులో ఖడ్గం, మగధీర వంటి చిత్రాల్లో నటించిన కిమ్ శర్మ.. 2010లో వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లాడింది. అతడితో విడిపోయిన తరువాత హర్షవర్ధన్తో ఆమె డేటింగ్ చేశారు. ఇక ఇటీవలే రాణే కరోనా నుంచి కోలుకున్నారు.