telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహరాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌…!

మహారాష్ట్రలో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు ఇక్కడే వెలుగు చూస్తున్నాయి. దీంతో మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోంది మహారాష్ట్ర సర్కార్. లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు సిద్ధం కావాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికారులకు సూచించారు. ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వైరస్ విజృంభణపై ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఈ ఆదేశాలిచ్చారు. వైరస్‌ కట్టడి చేసేందుకు ఇప్పటికే అక్కడ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది సర్కార్. లాక్‌ డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితులుండడంతో.. ఆహారధాన్యాల సరఫరా, మందులు, అత్యవసర సేవలు, వైద్య సౌకర్యాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం , అధికారుల మధ్య సమన్వయలోపం లేకుండా చూడాలని ఉద్ధవ్‌ ఠాక్రే దిశానిర్ధేశం చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొవిడ్‌ ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 6,923 పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. దీంతో కేవలం ఒక్క ముంబయి నగరంలోనే కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 45వేలు దాటింది. కొత్తగా మరో ఎనిమిది కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు ముంబయిలో 11వేల మంది కొవిడ్‌ మరణాలు సంభవించాయి.

Related posts