యావత్ సినీ ప్రపంచం కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేసిన క్రేజీ మూవీ ‘కేజీఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించి, బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. రాక్ స్టార్ యశ్ను ఓవర్ నైట్ స్టార్ను చేసింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘కేజీఎఫ్-2’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ అధీరా పాత్రలో నటిస్తున్నారు. తాజాగా నేడు సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు మేకర్స్. అత్యంత కౄరంగా, జాలి లేని మనిషిగా అధీరా కనిపించనున్నాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే అధీరా లుక్ చాలా కౄరంగా ఉంది.
next post