లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల తనయ శృతి హాసన్ కొద్ది రోజుల గ్యాప్ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలతో బిజీ అయింది శృతి. ఇప్పటికే తెలుగులో రవితేజతో కలిసి ఓ చిత్రం చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మహేష్ సరసన కూడా నటించనుందని అంటున్నారు. ప్రస్తుతం “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో బిజీగా ఉన్న మహేష్ త్వరలో వంశీ పైడిపల్లితో కలిసి మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్ళనుంది. అయితే ఈ చిత్రంలో కథానాయికగా శృతి హాసన్ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో శృతి, మహేష్లు శ్రీమంతుడు చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.