తెలంగాణలో కరోనా వైరస్ అన్ని రంగాల వారిని టచ్ చేస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులకు, హైదరాబాద్ మేయర్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి కూడా కరోనా సోకింది. జీవన్రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారన అయినట్టు మంగళవారం రాత్రి తెలిసింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్లో ఉండి కరోనా చికిత్స తీసుకుంటున్నారు. అప్రమత్తమైన అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్ట్లు నిర్వహించారు. అయితే వారి ఫలితాలు రావాల్సి ఉంది.