స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రానికి… ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ సోమవారం హైదరాబాద్ యూసఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ చిత్రం ద్వారా అప్పటి టాప్ హీరోయిన్ టబు రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా టబు మాట్లాడుతూ “ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే మాటలు రావడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో యాక్ట్ చేశాను. త్రివిక్రమ్గారు, బన్నీగారు, అరవింద్గారు, సుశాంత్ అందరూ కుటుంబ సభ్యుల్లాగా మారిపోయారు. ఇంత గ్యాప్ తర్వాత తెలుగులో ఈ సినిమా కంటే గొప్పగా రీ ఎంట్రీ ఇవ్వలేనేమో అనిపించింది. తప్పకుండా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. అందరికీ చాలా థ్యాంక్స్” అని అన్నారు.
previous post