telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ప్రభాస్ తో .. పూరి … తరువాత ప్రాజెక్ట్ అదేనా..

director puri with prabhas in next project

ప్రభాస్ సాహో తర్వాత ప్రభాస్ జాన్ అనే సినిమాలో నటించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కూడా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తోంది. పూరి జగన్నాధ్ గత కొంత కాలంగా డిజాస్టర్లతో సతమతమయ్యాడు. ఒక దశలో ఏ హీరో కూడా పూరి కథ వినడానికి ఆసక్తి చూపలేదు. మహేష్ తో పోకిరి- బిజినెస్ మేన్ లాంటి క్రేజీ సినిమాల్ని తీశారు. కానీ ఆ తర్వాత నుంచి మహేష్ తో ఎందుకనో పూరికి మహేష్ కి సెట్ అవలేదు. అంతేకాదు పూరి కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ కి కథ చెబితే నో చెప్పారట. దీంతో బాగా హర్ట్ అయ్యారు కూడా. ఇక రీసెంట్‌గా రాం పోతినేని హీరోగా పూరి నిర్మించి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడమే కాకుండా దాదాపు 75 కోట్ల పైనే వసూళ్ళు సాధించింది. దీంతో పూరీ మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చేశాడు.

అంటే పూరి కథకు నో చెప్పిన వాళ్ళే మళ్ళీ పూరీ తో జతకట్టడానికి రెడి అవుతున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పూరి ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని లేటెస్ట్ గా న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు ప్రభాస్ కు ప్రస్తుతం ఉన్న క్రేజును ఉపయోగించి పాన్ ఇండియా లెవల్లో పూరి ఒక మంచి చిత్రం తీయాలని ఉబలాటంతో ఉన్నాడట. ఏదేమైనా ఈ కాంబినేషన్ గనక మరోసారి సెట్ అయితే మాత్రం మళ్ళీ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ హిట్ తప్పనిసరి.

Related posts