ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 25 న విచారణకు హాజరు కావాలని నామాకు ఈడీ సమన్లు పంపింది. బ్యాంకు రుణాలను మళ్ళీంచిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ చేసింది ఈడీ. మదుకాన్ కేసులో నిందితులందరికీ సమన్లు ఇచ్చిన ఈడీ.. మదుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల రెండు రోజుల పాటు సోదాలు జరిపింది. సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంది ఈడీ. ప్రస్తుతం దస్త్రాలు, ఖాతాలు, హార్డ్ డిస్కులను ఈడీ బృందాలు విశ్లేషిస్తున్నాయి.
previous post
next post