ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక పూరి విషయానికొస్తే… మాస్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ తెలుగులో దాదాపు అగ్రహీరోలందరితోనూ కలిసి పని చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన పూరీ ఆయనతో మాత్రం సినిమా చేయలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ పూరీకి వచ్చి ఉండేది. అయితే పూరీ చెప్పిన “ఆటోజానీ” కథ సెకెండాఫ్ చిరంజీవికి నచ్చలేదు. దీంతో ఆ అవకాశం వీవీ వినాయక్కు దక్కింది. తాజాగా “ఇస్మార్ట్ శంకర్”తో విజయం అందుకున్న పూరీ, చిరంజీవితో సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “చిరంజీవి 150వ సినిమాను ఎంటర్టైన్మెంట్ రూట్లో చేద్దామనుకున్నాం. అయితే ఆయన చివరి నిమిషంలో మనసు మార్చుకుని `కత్తి` రీమేక్ చేయాలనుకున్నారు. చిరంజీవితో సినిమా చేసే అవకాశం నాలుగు సార్లు వచ్చి మిస్ అయింది. అందులో రెండు సార్లు పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికైనా చిరంజీవి అంగీకరిస్తే ఐదు రోజుల్లో కథ రాసేస్తాను” అని చెప్పుకొచ్చాడు.
previous post