telugu navyamedia
సినిమా వార్తలు

అంతా నా విగ్రహాలు పెట్టుకోవాలి : నటి హేమ

Hema

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీ నుంచి తారలు వైసీపీ బాట పడుతున్నారు. ఇప్పటికే నటుడు మోహన్ బాబు, పృథ్వీ, రాజశేఖర్, జీవిత, హేమ తదితరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హేమ తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ ‘‘నేను కొన్ని ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ వాళ్లు మీరు ఏమీ ఆశించకుండా రండి అని అంటున్నారు. కానీ నాకు ప్రజాసేవ చేయాలని ఉంది. అందుకు నాకు పవర్ కావాలి. అందరూ స్టేజీ మీద ఉంటే నేను కింద ఉండలేను. నాకు స్టేజీ మీద ఉండాలని ఉంది. జనాల గుండెల్లో, వాళ్లకు దగ్గరగా ఉండాలని ఉంది. కానీ ఇప్పటికే అన్ని అయిపోయాయి. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే వస్తాను అనేంత అమాయకురాలిని కాదు నేను. ప్రజాసేవ చేసేందుకు నాకు పవర్ కావాలి. అది ఎమ్మెల్యేనో లేక ఎంపీనో కాదు. మరే పదవి అయినా ఫర్వాలేదు. భవిష్యత్తులో నేను పోటీ చేసేందుకు రెండు నియోజకవర్గాలు ఎంచుకున్నాను. మా అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తుంది. అవి పూర్తైతే తను డిగ్రీలోకి వెళ్తుంది. తను పెద్దది అయిపోయింది. నా అవసరం తనకు లేదు. దీంతో నేను పూర్తిగా ప్రజా సేవలోకి వెళ్తాను. ప్రజాసేవ ఎలా చేస్తానంటే అందరూ నా విగ్రహాలు పెట్టుకోవాలి’’ అని తెలిపింది హేమ.

Related posts