ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. భూమా అఖిలప్రియ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగోలేకపోయినా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. రెండు రోజుల నుంచి మాత్రం విరామం తీసుకుంటున్నారు.
నియోజకవర్గంలో పర్యటించే సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతోనే ఆమెకు వడదెబ్బ తగిలిందని, అందుకే ప్రచారంలో పాల్గొనడం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. దీంతో అఖిలప్రియకు ఆమె ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుటపడగానే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
ఎవరికి వారే హీరోలు అనుకుంటే కాంగ్రెస్లో నడవదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి