ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఏపీ రాజధానిపై పార్టీలు రాజకీయాలకు చేయగా… ఇప్పుడు ఏపీలోని దేవాలయాలపై పడ్డాయి. విగ్రహాల ధ్వంసంపై ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రామతీర్థం ఘటనతో రాజకీయ పార్టీలతో రణరంగంగా మారింది. ఒకేరోజు మూడు పార్టీల నేతలు … రామతీర్థంలో పర్యటించడంతో… ఉద్రిక్తతంగా మారిన విషయం తెలిసిందే. రామతీర్థంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డిల పర్యటనతో ఏపీ రాజకీయాలు ఇంకా వేడేక్కాయి. ఇదే అదునుగా తీసుకుని వైసీపీ, టీడీపీ పార్టీలపై బీజేపీ ఎదురుదాడులు చేస్తోంది. ఇలా ఏపీ పాలిటిక్స్ కాస్త… దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపైనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడు నటుడు సుమన్ విగ్రహాల ధ్వంసంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం బాధాకరమని… ఆలయాల్లో సీసీ కెమెరాలతోపాటు భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. జగన్కు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాల కుట్రలు చేస్తున్నాయని అనుమానాలు వస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యకూడదని… నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిందేనని నటుడు సుమన్ స్పష్టం చేశారు.
previous post