చిత్తూరు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పాకల మండలం నేండ్రగుంట సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరగగా… అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. ఓమిని వ్యాన్ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కర్ణాటక రాష్ట్రం నంగిలి మండలం తొండపల్లి గ్రామానికి చెందిన జ్యోతి (14), అన్నపూర్ణ (60), రాజమ్మ (80) గా గుర్తించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
previous post
next post