telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోంది: చంద్రబాబు

chandrababu

వైసీపీ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ రోజు పాణ్యంలో మీడియాతో మాట్లాడారు. అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చాలా నియోజక వర్గాల్లో మా పార్టీ నేతలపై వేధింపులు పెరిగాయన్నారు. ఒక టెర్రరిస్ట్ స్టేట్ లో ఏవిధంగా ఉంటుందో ఆవిధంగా వీళ్లు ప్రవర్తించారు.

వైసీపీ వైఖరిని చూసి మా పార్టీ శ్రేణులు స్తబ్దుగా ఉన్నప్పటికి.. వాళ్లే వచ్చి దాడిచేయడం బాధాకరం, కొన్ని పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని కేసు కూడా ఇవ్వరాదని మాట్లాడారు. ఒకవేళ కేసు ఇస్తే దాన్ని బెయిలెబుల్ కింద పెట్టారు. అవతలి వాళ్లు మాపై కేసు పెడితే దాన్ని నాన్ బెయిలెబుల్ కేసుగా నమోదుచేసి మా వాళ్లను అరెస్టు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts