యూపీలోని హత్రాస్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన కాన్వాయ్ తో బయలుదేరారు. మార్గమధ్యలోని గ్రేటర్ నోయిడా వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దాంతో ఆయన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలినడకన ముందుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా యమున ఎక్స్ ప్రెస్ హైవేపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
హత్రాస్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడికి వెళ్లడం మానుకోవాలని పోలీసులు రాహుల్ గాంధీకి సూచించారు. అయితే ఆయన ముందుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఓ దశలో పోలీసులతో తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఇతర కాంగ్రెస్ నేతలు ఆయన పైకి లేచేందుకు సాయపడ్డారు.
గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారు: మంత్రి బొత్స