విక్టరీ వెంకటేష్ “గురు” సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు హీరోయిన్ రితికా సింగ్. ఈ చిత్రం తమిళ వెర్షన్… సుధా కొంగర దర్శకత్వంలో మాధవన్ హీరోగా నటించిన ‘ఇరుదిసుట్రు’ చిత్రం ద్వారా హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయ్యారు రితికా సింగ్. ఆ చిత్రంలో బాక్సింగ్ క్రీడాకారిణిగా నటించారు. వాస్తవానికి ఆమెకు బాక్సింగ్ బాగా తెలుసు. దీంతో ఆ పాత్రలో రితికాసింగ్ చక్కగా ఇమిడి పోయారు. ఇటీవల రితికా సింగ్ నటించిన ‘ఓ మై కడవులే’ చిత్రం సూపర్హిట్ అయ్యింది. అరుణ్విజయ్ నటిస్తున్న ‘బాక్సర్’ చిత్రంలో, అరవింద్సామి నటిస్తున్న ‘వనంగాముడి’ చిత్రంలోనూ రితికా నటిస్తోంది. కాగా ఇటీవల మేకప్ లేకుండా తీసిన ఓ ఫొటోను రితికాసింగ్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అది చూసిన అభిమానులు ఆమె ముఖంపై మొటిమలు ఉన్నాయంటూ విమర్శలు చేశారు. దీంతో రితికా స్పందిస్తూ అమ్మాయిల ముఖంపై మొటిమలు రావడం సహజమేనని, ఇలాంటి చిన్న చిన్న విషయాలపై విమర్శలు చేసి రాద్ధాంతం చేయాల్సి అవసరం లేదని అభిమానులకు హితవు చెప్పింది. స్కిన్ సంబంధిత సమస్యలు అందరికీ వస్తాయని, ఎవరికీ రాని సమస్య తనకు వచ్చినట్లు కామెంట్స్ చేయడం చాలా బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి కామెంట్స్ను తాను పట్టించుకోనని, కానీ ఇలా ప్రవర్తన సరికాదని రితికా వీడియోలో తెలిపారు.
“ఛీఛీ… నేను మాట్లాడటమేంటి?…” నాగబాబు కామెంట్స్ పై బాలయ్య రియాక్షన్