telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా రూ.7500 ఎవరు మింగారు ?… కేటీఆర్ కు మాధవీలత షాకింగ్ పోస్ట్

Madhavilatha

‘నచ్చావులే’ హీరోయిన్ మాధవీలత గత ఎన్నికల్లో బీజేపీ కండువా కప్పిన తరువాత నాటి నుంచి సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద పోస్ట్‌తో వార్తల్లో ఉంటోంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేసి నా రూ. 7500 ఎవరు మింగారు అంటూ వివాదాస్పద పోస్ట్ పెట్టింది. “మే నెలలో రూ. 7500 కరెంట్ బిల్లు కట్టాను. ఎయిర్టెల్ యాప్‌లో ద్వారా పే చేశా.. కాని కరెంటు బిల్లు కట్టలేదని మళ్ళీ రూ. 7500 కట్టించుకున్నారు. సరే అని క్రెడిట్ కార్డు వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళు మెయిల్ పెడితే మేము ఎయిర్టెల్‌కి పే చేసేశాం అన్నారు. ఎయిర్టెల్ వాళ్ళకి మెయిల్ పెడితే సాక్షాలతో సహా మెయిల్ పంపుతూ బిల్లు కట్టాము అన్నారు. మరి నా రూ. 7500 ఎవరు మింగారు? ఎంతమంది బిల్లులు మింగుతారు? నేను హైదరాబాద్‌లో ఉన్నాను కనుక.. నేను ఉన్న ప్రభుత్వాన్నే అడుగుతున్నా. పవర్ బిల్లు కట్టలేదు అని మళ్లీ కట్టించుకున్న వాడితో కుమ్మక్కై.. ప్రజల మీద బిల్లులు రుద్దే ప్రభుత్వాలు.. ఇపుడు నా రూ. 7500 ఎవడు ఇస్తారు? డబ్బులెవరికి ఊరికే రావు సర్… ప్రతి రూపాయి విలువైనదే.. అంటే నీలి రంగు, గులాబీ రంగు వాడికి మండుద్ది. ఒకవేళ అంత మండితే నా 7500 నాకు ఇచ్చి అపుడు పెట్రోల్ పోసుకుని మరి మంట తెచ్చుకుని అరవండి. కానీ నా పైసల్ నాకు కావాలె. వాడు తినలే వీడు తినలే మరి నా పైసల్ ఏడికి పోయినయి ??? ఇలా ఇప్పటికే చాలామంది మీద బిల్లులు మోపారు.. డబుల్ ధమాకాలు మోపుతున్నారు.. అయినా కడుతున్నాం… ఏమో నాకు తెల్వదు.. నా పైసల్ నాకు కావాలి ఎవరిస్తారు.. మూడు నెలలైంది.. అన్ని సోర్స్ నుంచి ట్రైల్ చేస్తున్నా” అంటూ కేటీఆర్, కేసీఆర్, తెలంగాణ విద్యుత్ శాఖలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది మాధవీలత. అయితే బిల్లు చెల్లించినట్టు అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని.. అయితే సెక్యురిటీ ఇష్యూస్ వల్ల ఫేస్ బుక్‌లో షేర్ చేయలేదని చెప్పింది మాధవీలత.

Related posts