రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఈగ” సినిమాలో విలన్ గా నటించారు సుదీప్. కన్నడంలో సుదీప్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో మాత్రం “ఈగ” సినిమాతో విలన్ గా పరిచయమయ్యారు. తాజగా సుదీప్ ఓ సస్పెన్సు థ్రిల్లర్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కన్నడ దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్ చెప్పిన కథ నచ్చడంతో సుదీప్ సినిమాకు సంబంధించిన మొత్తం పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. “ఉద్ఘర్ష” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో థాకూర్ అనూప్ సింగ్, సాయి ధన్సిక, శ్రద్ధాదాస్, తాన్య హోప్, కిషోర్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా “ఉద్ఘర్ష” చిత్రం తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. “అందరూ కొత్త ఏడాది సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో జరిగిన ఓ హత్య వారిని ఒక వేరొక దారిలోకి తీసుకెళ్లింది” అంటూ చెప్పే గంభీరమైన గొంతుతో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సంజయ్ చౌదరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దేవరాజ్ నిర్మిస్తున్నారు. మరి మీరు కూడా ట్రైలర్ ను చూసేయండి.