లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన మూత్ర పిండాలు సరిగా పనిచేయడం లేదని సీనియర్ డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ ఆదివారం వెల్లడించారు. రక్తంలో చక్కెర, రక్తపోటు స్థాయిలో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఆహారం కూడా తక్కువగా తీసుకుంటున్నారని చెప్పారు.
పశుగ్రాసం కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 నుంచి లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు.
దిశ మర్డర్… వాళ్ళు నిందితులు కాదు : పోసాని సంచలన వ్యాఖ్యలు