టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘చంద్రోదయం’ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైందని చిత్ర నిర్మాత జీవీకే రాజేంద్ర ప్రకటించారు. శుక్రవారం విజయవాడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేంద్ర మాట్లాడుతూ ‘చంద్రోదయం’ సినిమాను మార్చి 10న రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
చంద్రబాబు రాజకీయ ఇతివృత్తంతో మోహన్ శ్రీజ సినిమాస్ శ్వేతార్క గణపతి ఎంటర్ప్రైజస్ పతాకంపై చిత్రాన్ని నిర్మించినట్టు రాజేంద్ర తెలిపారు. ఈ సినిమా షూటింగ్ను ఆగస్టు 2016లో ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, దర్శకత్వం పసుపులేటి వెంకటరమణ వహించినట్టు తెలిపారు.
నాకు పగ, రాగద్వేషాలు లేవు..