కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జార్ఖండ్ కేడర్ కు చెందిన రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 30 ఏళ్లకు పైగా ఎన్నో కీలకమైన బాధ్యతలను ఆయన నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల్లో ఆయన సేవలు అందించారు. కేంద్ర ఆర్థికశాఖలో ఖర్చుల విభాగానికి సంబంధించి జాయింట్ సెక్రటరీ, ఆ తర్వాత అడిషనల్ సెక్రటరీగా కూడా పని చేశారు. సీఈసీగా అశోక్ లావాస గత నెల 18న రాజీనామా చేశారు. అనంతరం రాజీవ్ కుమార్ ను నూతన చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.