telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోనిని ఇప్పుడు కలిసి అదే ఫీలింగ్ : జడేజా

ఐపీఎల్ 2020 తర్వాత నేరుగా ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు గాయాలబారిన పడ్డారు. అందులో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. అయితే ఆ గాయం కారణంగా ఇంగ్లాండ్ తో సిరీస్ లకు దూరంగా ఉన్న జడేజా తాజాగా ముంబైలో ఏర్పాటు చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ క్యాంప్‌కు చేరుకున్నాడు. అక్కడ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కలుసుకున్న జడేజా … దాదాపు ఏడాది తర్వాత మహీని కలవడంతో ఏమోషనల్ అయ్యాడు. ‘మహేంద్రసింగ్ ధోనీని ఎప్పుడు కలిసినా మొదటిసారి అతన్ని కలిసినట్లు అనిపిస్తుంది. 2009లో తొలిసారి అతన్ని కలిసినప్పుడు ఎలాంటి ఉత్సుకతతో ఉన్నానో.. ఇప్పుడూ సేమ్ అదే ఫీలింగ్”అని ఈ స్టార్ ఆల్‌రౌండర్ వెల్లడించాడు. ఇక మహేంద్రసింగ్ ధోనీతో సుదీర్ఘకాలంగా రవీంద్ర జడేజాకు మంచి స్నేహబంధం ఉంది. భారత్ జట్టుకి కూడా ఈ ఇద్దరూ చాలా రోజులు కలిసి ఆడగా.. ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా ఆడుతున్న విషయం తెలిసిందే.

Related posts