ఏపీ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలని ఆదేశిస్తూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎస్ఈసీ అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకం. ఈ చర్యలతో ఆర్టికల్ 243కె(2)కు సార్ధకత ఏర్పడింద ని చెప్పారు.కరోనా వ్యాప్తి వేళ ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ తొలగింపు రాజ్యాంగ ఉల్లంఘనని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడటం ముదావహమని చంద్రబాబు అన్నారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కాపాడాలని చంద్రబాబు ట్వీట్లు చేశారు.
అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర: చంద్రబాబు