దుబ్బాక ఎన్నికలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ఎన్టీవీతో మాట్లాడారు. కేంద్ర నిధుల విషయంలో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీ బలాన్ని చూసి అధికార పార్టీ భయపడుతుందని..దుబ్బాకలో కాషాయ జెండా ఎగురుతుందని అభిప్రాయపడ్డారు బండి సంజయ్. పక్క ఇంట్లో డబ్బులు దొరికితే నానా యాగీ చేస్తున్నారని..దుబ్బాక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దుబ్బాక లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని..అధికారాన్ని ఉపయోగించి అడ్డదారులు తొక్కి గెలవాలని చూస్తుందని ఆరోపణలు చేశారు. బీజేపీ అత్యధిక మెజారిటీ తో గెలవబోతుందని వెల్లడించారు. బీజేపీ గెలిస్తే మల్లన్న సాగర్ నిర్వాసితులు ను తీసుకుని వెళ్లి వారం రోజుల్లో ప్రగతి భవన్ ముందు కూర్చుంటామని..కరీంనగర్ ఫలితమే దుబ్బాక లో వస్తుందని పేర్కొన్నారు. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.
previous post
యువత సెల్ ఫోన్ వ్యసనానికి బానిస కాకూడదు: హరీశ్ రావు