వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటనతో పెళ్లికొచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా వారిలో 95 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం కలకలం రేపింది. ఈ ఘటన బీహార్లోని పాలిగంజ్ పట్టణంలో జరిగిందీ. దీహపాలికి గ్రామానికి చెందిన యువకుడు గురుగ్రామ్లో (30) సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెళ్లి కోసం మే 12న గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు కరోనా బారినపడినా గుర్తించలేకపోయాడు. పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో ఈ నెల 15న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు.
పెళ్లి జరిగిన రెండు రోజులకే వరుడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో పాట్నాలోని ఎయిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. కరోనా పరీక్షలు చేయించకుండానే వరుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలిసిన అధికారులు వివాహానికి హాజరైన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 95 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. వధువుకు మాత్రం పరీక్షల్లో నెగటివ్ అని వచ్చినట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణకు రాబడి తక్కువ… అప్పులు ఎక్కువ: భట్టి విక్రమార్క