తెలంగాణ సీఎం కేసీఆర్పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ది అంకెల గారడీ బడ్జెట్ అని భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను చూపుతూ కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన చెప్పారు.
2024 వరకు రాష్ట్ర అప్పులు రూ.5లక్షల కోట్లకు చేరనున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రాబడి తక్కువ… అప్పులు ఎక్కువ ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ అప్పులను ఎలా తీరుస్తారో కేసీఆర్ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అప్పులు కట్టడానికేనా ప్రజలు పోరాడి తెలంగాణ సాధించుకున్నది? అని ప్రశ్నించారు.