telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

అర్ధరాత్రి కుప్ప కూలిన ఫ్లై ఓవర్..ఇద్దరికి గాయాలు

bridge damage

హర్యానాలోని గురుగ్రామ్‌లో గత అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనాయి. అర్ధరాత్రి సమయం కావడం ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని అధికారులు ఆసుపత్రికి తరలించారు.

శిథిలాల తొలగింపు పనులను అధికారులు ముమ్మరం చేశారు. రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు 6 కిలోమీటర్ల పొడవున రూ. 2 వేల కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ నిర్మాణ పనులను చేపట్టింది. ఈ ఘటనపై ఓరియంటల్ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ స్పందించారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఫ్లై ఓవర్‌ ఎలివేటెడ్ రోడ్డు‌లోని కొంత భాగం కూలిపోయింద‌ని తెలిపారు.

Related posts