telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదల్చుకున్నావు…

గిరిజనులకు భరోసా నింపడానికి బీజేపీ గుర్రంపోడు తండా కి వెళ్ళింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అక్కడ పోలీస్ లు ప్రైవేట్ వ్యక్తులకు అండగా నిలిచారు.. పేద గిరిజనుల పై లాఠీ ఛార్జ్ చేశారు..  పోలీస్ లకు గాయాలు అయినందుకు క్షమాపణ కూడా చెప్పాను. అయిన మా కార్యకర్తలను హింసిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదల్చుకున్నావు అని అన్నారు. నాగార్జున సాగర్ బహిరంగ సభలో ఒక పోలీస్ అధికారికి బీజేపీ కార్యకర్తలు నేతలను వదిలి పెట్టవద్దని చెప్పాడు. కేసీఆర్ శిష్యుడు ప్రభాకర్ రావు. కేసీఆర్ నీకు ఆందోళన గురించి తెలియదు.. నీది దొంగ దీక్ష అని తెలిపారు. ప్రభాకర్ రావు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు… అన్ని బయట పెడతాం. 2023 లో అధికారంలోకి వచ్చేది మేమే.. నీ సంగతి అప్పుడు చెబుతాం అని అన్నారు. గుర్రంపోడు భూముల పై ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఏమని ఇచ్చావు ప్రభాకర్ రావు అని అడిగిన ఆయన  కేసీఆర్ ని కొంప ముంచేది ప్రభాకర్ రావే అని స్పష్టం చేసారు. అలాగే నాగార్జున సాగర్ లో గిరిజనులు నీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక మహిళను చంపారు.. ముఖ్యమంత్రి కి సోయి ఉందా. సీఎంకి గుణపాఠం చెప్పి తీరుతాం. భయం అంటే ఏంటో కేసీఆర్ నీకు చూపెడతాం. కేసీఆర్ మీ శ్రీమతి గారి వయస్సు ఉన్న మహిళ ను ఈ రోజు పోలీస్ లు తీసుకెళ్లారు. అదే పరిస్థితి నీకు వస్తుంది రాసి పెట్టుకో… కేసీఆర్ జైలు కి పోవడం ఖాయం. సీఎం విషయం ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయితే ప్రభుత్వం దే బాధ్యత. మేము గుర్రంపోడు విషయం లో ఏమి చేయబోతున్నామో దమ్ముంటే ప్రభాకర్ రావు తెలుసుకోవాలి అన్నారు.

Related posts