ఎన్నికల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిల్లో మద్యం కూడా ఒకటి. ప్రభుత్వాలకు అధిక ఆదాయం ఇచ్చేది కూడా మద్యమే. ఇలాంటి మద్యాన్ని ఓ మహిళ నేలపాలు చేసింది. అదీ వందో వెయ్యి రూపాయల మధ్యమో కాదు… రూ.95 లక్షలకు పైగా విలువ చేసే మద్యం. 500 బాటిళ్ల విలువైన మద్యాన్ని ఓ మహిళ పగలగొట్టింది. ఈ సంఘటన యూకే లోని ఓ సూపర్ మార్కెట్లో జరిగింది. హెర్డ్ ఫోర్డ్ షైర్ లోని ఓ సూపర్ మార్కెట్ కు వెళ్లిన మహిళ వస్తువులు కొనుగోలు చేయకుండా, ర్యాక్ లో ఉన్న మద్యం బాటిళ్లను ఒక్కొక్కటిగా తీసుకొని పగలగొట్టడం మొదలుపెట్టింది. 500 బాటిళ్లను పగలగొట్టింది. వాటి విలువ 1,30,000 డాలర్లు ఉంటాయట. మద్యం బాటిళ్లు పగలగొడుతుంటే, సూపర్ మార్కెట్ యాజమాన్యం అడ్డుకోలేదు. పోలీసులకు ఫోన్ చేసి ఊరుకున్నారు. అయితే, ఆ మహిళ మద్యం బాటిళ్లను ఎందుకు పగలగొట్టింది అనే విషయాన్ని సూపర్ మార్కెట్ అధికారులు వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
next post