బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కార్మికులను వాళ్ళ సొంత గూటికి చేర్చడం కోసం ఇప్పటికే బస్సులు, రైళ్ళను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సోనూ ఇటీవల కొచ్చి నుండి భువనేశ్వర్కి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా దాదాపు 150 మందిని సొంత గూటికి చేర్చారు. ఈ కరోనా కష్టకాలంలో తమకి అండగా నిలిచిన సోనూని వారందరు దేవుడిగా కొలుస్తున్నారు. తాజాగా ముంబై నుండి ఉత్తారాఖండ్లోని డెహ్రాడూన్కి వెళ్ళేందుకు ఎయిర్ ఏషియాకి చెందిన విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లైట్లో 173 మంది వలస కార్మికులని వారి ప్రాంతానికి పంపారు. కష్టాలలో ఉన్న వారికి అండగా ఉండడం తనకి సంతోషాన్ని కలిగిస్తుందంటున్నారు సోనూ. వలస కార్మికులలో చాలా మందికి ఎప్పుడూ విమాన ప్రయాణం చేసే అవకాశం రాలేదు. వారి కుటుంబాలని, స్నేహితులని కలుసుకునేందుకు ఎయిర్ ఏషియా ఇండియా విమానంలో ప్రయాణించినప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వులు నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నందున దేశంలోని వలస కార్మికుల సమూహాలు ఇంటికి తిరిగి రావడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి కోసం భవిష్యత్తులో మరిన్ని విమానాలను ఏర్పాటు చేయనున్నట్లు సోను సూద్ చెప్పారు.
previous post