telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నేడే పవన్ నామినేషన్.. అటునుండి బహిరంగ సభకు..

no alliances in ap said pavan kalyan

నేడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విశాఖ జిల్లా గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్న ఆయన, నేడు తన నామినేషన్‌ ను దాఖలు చేయనున్నారు. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆయన, నేరుగా జీవీఎంకు వెళ్లి నామినేషన్ వేయనున్నారు. ఆపై 11 గంటలకు పాత గాజువాకలో బహిరంగ సభ నిర్వహించి, ప్రజలతో మాట్లాడతారు. భోజన విరామం తరువాత, మధ్యాహ్నం మూడింటికి ఆనందపురం పూల మార్కెట్‌ వద్ద, సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని పాత జైలు రోడ్డు వద్ద జరిగే సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.

వైఎస్ జగన్ రేపు పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. పార్టీ మేనిఫెస్టోకు తుదిరూపును ఇచ్చే పనిని నేడు పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ఆయన, ప్రచారానికి కూడా విరామం ప్రకటించారు. నేడంతా మ్యానిఫెస్టో కమిటీతో సమావేశం కానున్న జగన్, రేపు నామినేషన్ వేసిన తరువాత, పులివెందులలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, ఆపై తిరిగి రాష్ట్రవ్యాప్త ప్రచారానికి వెళ్లనున్నారు.

Related posts