ఆన్ లైన్ మార్కెట్ లలో పేరుగాంచిన అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లు మరోసారి భారీ డిస్కౌంట్ లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ డీల్స్ ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులోకి రానుండగా అమెజాన్ ప్రైమ్ సభ్యులకు, ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు ఈ నెల 19 నుంచే ఈ ఆఫర్లు లభిస్తాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఈ నెల 20 నుంచి 23 వరకు ఆఫర్లు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఈనెల 20 నుంచి 22 వరకు డీల్స్ ప్రకటించింది.
ఈ సేల్లో భాగంగా అమెజాన్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు వాడి కొనుగోళ్లు జరిపే వారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ సేల్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి షాపింగ్ చేసేవారికి 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఎలకా్ట్రనిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. కొన్ని మోడళ్లపై వడ్డీ లేకుండా నెలసరి వాయిదాల చెల్లింపు పద్ధతి కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్లో ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో వన్ ప్లస్ 6టి, రెడ్మి వై2, హువాయ్ నోవె 3ఐ, హానర్ 8ఎక్స్ స్మార్ట్ ఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.
అమెజాన్ ఎకో ఉత్పత్తులు రూ.1,500 డిస్కౌంట్తో, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 25శాతం డిస్కౌంట్తో లభిస్తాయి. కొన్ని ల్యాప్టాప్లు రూ.35,000 తగ్గింపుతో లభిస్తాయి. 450 రకాల హెడ్ ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపు, హార్డ్ డ్రైవ్స్పై 60శాతం తగ్గింపు, నికాన్, క్యానన్, సోనీ కెమెరాలపై కనీసం రూ.5,000 తగ్గింపు ప్రకటించారు.
బీజేపీలో చేరిన వారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారా: చంద్రబాబు