telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అజిత్ రీమేక్ లో చిరు…

chiranjeevi megastar

చిరు తాజా సినిమా ఆచార్య.  ఈ సినిమా కొరటాల శివ దర్వకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమా తరువాత చిరు లూసిఫర్ సినిమా రీమేక్‌ చేయనున్నారు. లూసిఫర్ రీమేక్‌ను మోహన్ రాజా డైరెక్షన్‌లో ఫిబ్రవరిలో సెట్స్‌పైకి తీసుకెళ్లి ఏప్రిల్ సమయానికి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఆ తరువాత చిరు మరో రీమేక్ సినిమా లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ సినిమాను చేయనున్నారు. ఇప్పటి వరకు చిరు లైన్‌లో పెట్టిన సినిమాలు ఇవి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరు మరో రీమేక్‌ను ఖరారు చేశారంట. అజిత్ హీరోగా 2015లో రిలీజ్ అయిన ఎన్నై అరిందాల్ భారీ హిట్ అయింది. ఈ సినిమా తెలుగులో ‘ఎంతవాడు గాని’ పేరుతో విడుదలయ్యి హిట్ అయింది. ఇప్పుడు చిరు ఈ సినిమాను రేమేక్ చేసేందుకు ఆలోచిస్తున్నారని, ఈ కథకు సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నారని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది అనేది.

Related posts