బాలీవుడ్ నటులు ధర్మేంద్ర, హేమమాలిని కూతురు ఈషా డియోల్ ఎనిమిదేళ్ల కిందటి భావోద్వేగపూరిత వీడియోను షేర్ చేసుకుంది. పెళ్లి కార్యక్రమం పూర్తయ్యాక అప్పగింతల (విడై) సమయంలో తల్లిదండ్రులను విడిచి వెళ్తుండటంతో ఈషా కంటతడి పెట్టింది. ధర్మేంద్ర తన కూతురు ఈషాను హత్తుకొని ఓదార్చుతున్న వీడియోను ఈషా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈషా సోదరి అహన కంటతడి పెట్టింది. తన జీవితంలోని అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ… పెండ్లి ఫొటోలను షేర్ చేసిన బాదల్రాజా కంపెనీకి ఈషా కృతజ్ఞతలు తెలియజేసింది. ఈషాడియోల్, భరత్ తఖ్తనీ 2012లో పెద్దలను ఒప్పించి, ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
View this post on Instagram