వాణిజ్య ప్రకటనల్లో నటించే ఓ అమ్మాయి స్టేషన్లో రైలు కోసం వేచి ఉంది. అదే సమయంలో భూషణ్ నాయక్ (45) అనే వ్యక్తి అక్కడకి చేరుకొన్నాడు. అనుమతి లేకుండా యువతి వీడియోను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. దీనిని గమనించిన ఆ యువతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ముంబయిలోని అంధేరి రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకొంది. అదే సమయంలోనిందితుడి ఫోన్ పరిశీలించగా ఆమెను వీడియో తీసినట్లు తేలింది. ఇలా అతను పలువురిని వీడియోలు తీసి ఇతరులకు వాటిని షేర్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు భూషణ్ నాయక్పై ఐపీసీ సెక్షన్ 354సీ, 509 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు మోదీ: ప్రియాంక గాంధీ