పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టులో అవినీతికి వెలికితీసి చంద్రబాబు బండారాన్ని బయటపెడతామని అన్నారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై నాని మండిపడ్డారు. సొంత వదిననే చంపించిన దేవినేని ఉమ తమపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం జగన్ ను ఇకపై ఏకవచనంతో సంబోధిస్తే ఖబర్దార్ అని మండిపడ్డారు.టీడీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని తెలిపారు. సొంత మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు.
లోకేశ్ పదవి పోతుందని చంద్రబాబు భయం: మంత్రి బొత్స