సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విదేశీయులతో వెళ్తున్న ఓ బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. మక్కా నుంచి మదీనా వెళ్లే హిజ్రా రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మదీనాకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ అక్కాల్ గ్రామం వద్ద బుధవారం రాత్రి 7 గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. గాయపడ్డవారిని అల్ హమ్నా హాస్పటల్కు తరలించారు. ప్రమాదంలో మరణించినవారిలో ఆసియా, అరబ్ దేశాల యాత్రికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
అమిత్ షా టీడీపీకి తలుపులు మూసేశారు: కన్నా