telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో డాక్టర్ల పరిస్థితిపై స్పందించిన చంద్రబాబు

tdp chandrababu

వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా  ఏపీలో డాక్టర్ల పరిస్థితిపై ఆయన స్పందించారు. డాక్టర్లకు ఇప్పటికీ పీపీఈ కిట్లు అందించక పోవడం వైసీపీ ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వం డాక్టర్లపై చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధేస్తోందని అన్నారు. పీపీఈల కోసం విశాఖ ఈఎన్టీ ఆసుపత్రిలో డాక్టర్లు ధర్నా చేశారంటే ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటని ఆయన నిలదీశారు.

మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి, నడిరోడ్డుపై అర్ధనగ్నంగా, లాఠీలతో కొట్టించి, పిచ్చివాడని ముద్రవేసిందన్నారు. ప్రభుత్వం. ప్రపంచమంతటా డాక్టర్లపై పూలు చల్లి ప్రశంసిస్తోంటే ఏపీలో డాక్టర్ల పరిస్థితి ఇలావుండన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల సేవను గుర్తించి గౌరవించాలని చంద్రబాబు సూచించారు.

Related posts