telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమిత్ షా టీడీపీకి తలుపులు మూసేశారు: కన్నా

Kanna laxminarayana

ఏపీలో బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీని వెనక్కినెట్టి తాను బలోపేతం కావాలన్నది బీజేపీ ప్రణాళికగా కనిపిస్తోంది. ఆ దిశగానే పావులు కదుపుతోన్న కాషాయదళం టీడీపీపై మాటల యుద్ధంలో మరింత పదును పెంచింది. రాజకీయ విలువలు లేని టీడీపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

అమిత్ షా టీడీపీకి శాశ్వతంగా తలుపులు ఎప్పుడో మూసేశారని తెలిపారు. అవినీతే అజెండాగా అవకాశవాద రాజకీయాలతో యూటర్న్ లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన పార్టీగా టీడీపీని అభివర్ణించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొత్తుకోసం వెంపర్లాడుతున్నారో చెప్పాలని కన్నా నిలదీశారు.

Related posts