సినిమాటోగ్రఫర్గా బాలీవుడ్లో కూడా చక్రం తిప్పి ఆ తర్వాత “చిత్రం” సినిమాతో దర్శకుడిగా మారి “నువ్వు నేను, జయం” అంటూ సంచలనాలు సృష్టించాడు. 15 ఏళ్ల పాటు విజయం కోసం చూసి “నేనే రాజు నేనే మంత్రి” అంటూ మరో విజయం అందుకున్నాడు ఈయన. తాజాగా ఉత్తేజ్ యాక్టింగ్ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంటూ ‘ఎవరూ ఊరికే మెగాస్టార్ కాలేరు’ అని అన్నారు డైరెక్టర్ తేజ. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “చిరంజీవిగారు నటించిన ఓ సినిమాకు నేను కెమెరా విభాగంలో పనిచేశాను. ఆ సమయంలో చిరంజీవిగారిపై డైరెక్టర్ ఓ షాట్ను ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లాలి. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే ..చిరంజీవిగారు పరిగెత్తారు. డైరెక్టర్ షాట్ ఓకే అన్నారు. అయితే చిరంజీవిగారు వన్ మోర్ టేక్ అన్నారు. ఎందు్కని ఆయన్ని అడిగితే ఆ సీన్లో పెట్టిన 20 రిఫ్లెక్టర్స్లో ఓ రిఫ్లెక్టర్ పనిచేయలేదు. అక్కడ లైటింగ్ తగ్గిందని ఆయన అన్నారు. నటనపై అంత అకింతం భావం ఉంది కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు. అలా ఓ నటుడికి తన నటన పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. ఊరకనే ఎవరూ మెగాస్టార్లు అయిపోరు” అన్నారు. నటుడిగా ఎదగాలంటే ఫోకస్ కావాలని, ఎంతమందిలో ఉన్నా కూడా దృష్టి క్యారెక్టర్ మీద పెట్టినపుడే సక్సెస్ అవుతారని చెప్పాడు ఈ దర్శకుడు.
previous post