ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. జూలై 18న గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ తొలి రోజే ఊహించని కలెక్షన్స్ సాధించింది. పూరి జగన్నాథ్ స్టైల్ లో సాగే సైంటిఫిక్ మర్డర్ మిస్టరీ చిత్రం కాగా, మెమోరీ ట్రాన్స్ఫర్ అనే కొత్త అంశాన్ని టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని హైదరాబాదీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. చాలా రోజుల తర్వాత ఇటు పూరీకి ఇటు రామ్ ఖాతాలో “ఇస్మార్ట్ శంకర్”తో హిట్ పడింది.
18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ వారం రోజుల్లోనే 27 కోట్లు వసూలు చేసింది. నిజానికి సినిమాలో ఏం లేకపోయినా కూడా మాస్ డైలాగులు.. పూరీ మార్క్ ఆటిట్యూడ్.. దీనికి శ్రీరామరక్షగా నిలిచాయి. ఇక రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ పాత్రకు ప్రాణం పోసాడు. హీరోయిన్ల గ్లామర్ షో అదనపు ఆకర్షణ. నైజాంలో ఇప్పటికే ఈ చిత్రం 11.50 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక సీడెడ్ 4.20 కోట్లు.. ఉత్తరాంధ్ర 2.98 కోట్లు.. వెస్ట్ 1.33.. కృష్ణ 1.59.. గుంటూరు 1.67.. నెల్లూరు 0.83 కోట్లు వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. ఇప్పటికే ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో 25.22 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవర్సీస్ కూడా కలిపితే 27 కోట్లకు చేరిపోయింది ఈ లెక్క. మొత్తానికి పూరీ కోరుకుంటున్న బ్లాక్ బస్టర్ ఇన్ని రోజులకు వచ్చేసింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ సినిమాను కొన్న బయ్యర్లు లాభాల్లోకి వచ్చేసారు. భారీ లాభాల దిశగా వాళ్లు పయనిస్తున్నారు కూడా. ఈ వారం “డియర్ కామ్రేడ్” విడుదలతో “ఇస్మార్ట్ శంకర్”కు కలెక్షన్లు కాస్త తగ్గే అవకాశం ఉంది.
కేంద్ర మంత్రిపై ఫైర్ అయిన హీరో