జాన్వీ కపూర్ నటిస్తున్న “గుంజన్ సక్సేనా.. ద కార్గిల్ గర్ల్” సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. గుంజన్ సక్సేనా సినిమాను శరన్ శర్మ డైరక్ట్ చేస్తున్నారు. జీ స్టూడియోస్ దీన్ని ప్రజెంట్ చేస్తోంది. ఈ సినిమాను విడుదల చేయడమే మిగిలింది. కానీ లాక్డౌన్ వల్ల సినిమా హాళ్లు అన్నీ బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటిటీ ఫ్లాట్ ఫామ్ లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. జాన్వీ కపూర్ పైలట్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని కూడా ఓటీటీ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ డిజిటల్ రిలీజ్కు సంబంధించిన ట్వీట్ చేశారు. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించారు. ఇప్పటికే ఓటీటీ ఫార్మాట్లో గులాబో సితాబో సినిమాను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
previous post
next post