ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు . ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమాకు భారీగానే కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 కోట్లు కొల్లగొట్టింది. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పూరీ తాను ఆల్రెడీ “ఇస్మార్ట్ శంకర్” చిత్ర సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్” పేరుతో ఈ చిత్రం తీయబోతున్నానని ప్రకటించేశాడు. అయితే ఈ సీక్వెల్ లో హీరో ఎవరో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా… రామ్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను విభిన్నంగా ప్రశంసించాడు. “డియర్ పూరీ జగన్నాథ్ గారూ.. సినిమా నచ్చితే పొగుడుతాం. నచ్చకపోతే బూతులు తిడతాం. కానీ, మిమ్మల్ని మాత్రం ఏంటండి బూతులతో పొగడబుద్ధవుతోంది. నా మీద చూపించిన ప్రేమకు ధన్యవాదాలు” అని రామ్ ట్వీట్ చేశాడు.