telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రాణహానితో .. దుబాయ్ రాణి .. పరారీ.. 241కోట్లతో ..

dubai queen haya to london with 241 cr

పేరుకే పెద్దలు, మనసులు మాత్రం చిన్నవే అన్నట్టుగా .. యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (69) భార్య, హయా అల్ హుస్సేన్ (45) ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, రూ. 241 కోట్లతో పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆమె దుబాయ్ నుంచి లండన్‌ కు పారిపోయినట్టు చెపుతున్నారు. ఇటీవలే భర్తతో తెగదెంపులు చేసుకున్న ఆమె, తన ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లింది.

ఈ ఘటనపై షేక్ మహమ్మద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె మోసం చేసిందని ఆరోపించారు. వరి కోసం నువ్వు లండన్ వెళ్లావ్?అంటూ తన ఇన్‌ స్టాగ్రమ్ ద్వారా మండిపడ్డారు. జర్మనీకి చెందిన ఓ దౌత్యవేత్త సాయంతో హయా లండన్‌ కు వెళ్లినట్టు తెలుస్తోంది. తనకు జర్మనీలో ఆశ్రయం కల్పించాలని కూడా ఆమె కోరినట్టు సమాచారం. జోర్డన్ రాజుకు హయా సవతి సోదరి అవుతారు. 2004లో షేక్ మహమ్మద్‌ తో హయాకు వివాహం జరుగగా, వారికి ఇద్దరు పిల్లలు. విడాకుల తరువాత దుబాయ్‌ లో ఆమె ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు వచ్చాయి. హయా రాకపై లండన్ ప్రభుత్వం, దుబాయ్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

Related posts