అత్యాచారాలు ఇప్పటివరకు ప్రజాసంచారం లేని ప్రాంతాలలో జరిగేవి.. కొత్తగా ప్రయత్నించాలనిపించిందేమో.. ఈ దుండగులు సరాసరి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన భర్త, పిల్లలను బంధించి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలోని నికారియా ప్రాంతంలో జరిగిందీ ఘటన.
అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు బాధిత కుటుంబం తలుపు తట్టి, వారు తలుపు తీయగానే బలవంతంగా లోపలికి చొరబడ్డారు. అనంతరం భర్త, పిల్లలపై దాడిచేసి నిర్బంధించి వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన గ్రామస్థులు తీవ్ర గాయాలపాలైన దంపతులు, పిల్లలను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.