ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పై ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవీ యాదవ్ నిర్మాతగా ‘వెనకడుగేయని కాలం పేరే కేటీఆర్’ అనే సాంగ్ను నిర్మించారు. ఈ పాటకు గేయ రచయితగా మిట్టపల్లి సురేందర్, సింగర్ యాజీన్ నిజార్, సంగీతం భరత్ అడోనిస్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్, ఎడిటర్ వర ప్రసాద్ ఆద్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించారు.ఈ పాటను గురువారం రాత్రి ప్రగతి భవన్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆరెస్ నాయకురాలు కవిత విడుదల చేశారు. పాటను నిర్మించిన, పాడిన వారిపై కవిత ప్రశంసలు కురిపించారు.
previous post