భోపాల్ లో ఎన్నికల బరిలో దిగిన ఓ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోటీ చేసేందుకు తన వద్ద డబ్బులేవని, ప్రచారం కోసం రూ. 75 లక్షలు ఇవ్వండి.. లేదంటే కిడ్నీ అమ్ముకుంటాను.. అందుకు అనుమతి ఇవ్వండి అని ఎన్నికల కమిషన్కు ఓ నాయకుడు లేఖ రాశాడు. సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిశోర్ సమ్రితే బాలాఘాట్ లోక్సభ నియోజకవర్గానికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి దీపక్ ఆర్యకు కిశోర్ లేఖ రాశాడు.
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఒక అభ్యర్థి రూ. 75 లక్షలకు మించి ఖర్చు చేయరాదని ఎన్నికల కమిషన్ నిబంధన పెట్టింది. అంత డబ్బు తన వద్ద లేదు. రూ. 75 లక్షలైనా ఇవ్వండి. లేదా ఏదైనా బ్యాంకు నుంచి రుణం ఇప్పించండి.. అలా చేయని పక్షంలో తన కిడ్నీని అమ్ముకునేందుకు అనుమతివ్వండి అని తాను కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని లేఖలో కిశోర్. పేర్కొన్నారు.