ఏపీ రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాలోకేష్ స్పందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నట్టు లేదని, పోలీసు రాజ్యం కొనసాగుతున్నట్టుందని అన్నారు. రాజధాని రైతుల ఉద్యమాన్ని అణచి వేసేందుకు ఒక్కో గ్రామంలో వెయ్యి మంది పోలీసుల మోహరింపు దారుణమన్నారు. పల్లెల్లో పోలీసుల కవాతు ఏమిటని ప్రశ్నించారు.
రైతు ఉద్యమాన్ని అణచి వేసేందుకు ఈస్థాయి పోలీసు చర్యలు అవసరమా? అని ప్రశ్నించారు. గ్రామస్థులను ఇళ్లలో బంధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రశాంతమైన గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వం చిచ్చురేపుతోందని మండిపడ్డారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.