మోదీ మగాడే అయితే తాను తిట్టే తిట్లకు సముద్రంలో దూకి చచ్చిపోవాలంటూ టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై బాలకృష్ణ మరోసారి విరుచుకుపడ్డారు. హిందూపురంలో ఆయన ఇవాళ రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ మోదీకి సిగ్గూ, శరం లేవన్నారు. ఇప్పుడే కాదని, మోదీని ఇంతకుముందు కూడా తీవ్రస్థాయిలో తిట్టానని గుర్తు చేశారు.
మోదీని నేను తిట్టినట్టు దేశంలో ఎవరూ తిట్టి ఉండరని వ్యాఖ్యానించారు. గతంలో ఓసారి బాలకృష్ణ హిందీ భాషలో సైతం మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా, అదే తీవ్రతతో తిట్ల వర్షం కురిపించారు. కేసీఆర్, జగన్ లతో కలిసి రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఈ ముగ్గురూ కలిసి వచ్చినా తననేమీ చేయలేరంటూ ధీమా వ్యక్తం చేశారు.