telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

లాభాలతో ముగిసిన .. స్టాక్ మార్కెట్లు ..

husge loses again in stock markets

నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 177 పాయింట్ల లాభంతో 38,862 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 11,686 వద్ద ఈ వారం ట్రేడింగ్‌ను ముగించాయి. నేటి మార్కెట్‌లో గోద్రెజ్‌ షేర్లు 6శాతం లాభపడి జీవితకాల అత్యధికానికి చేరుకొన్నాయి. నవీ ముంబయిలో కొత్త రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను చేపట్టినట్లు ప్రకటించడంతో ఈ షేర్లు లాభపడ్డాయి.

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం పెరగడంతో అప్పర్‌ సర్క్యూట్‌ విధించారు. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విలీనంపై వార్తలు రావడంతో ఈ షేరు ధర పెరిగింది. ఇక చక్కెర కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. రేణుకా షుగర్స్‌ 16శాతం, మవన షుగర్స్‌ 14శాతం లాభపడ్డాయి.

Related posts