నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 177 పాయింట్ల లాభంతో 38,862 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 11,686 వద్ద ఈ వారం ట్రేడింగ్ను ముగించాయి. నేటి మార్కెట్లో గోద్రెజ్ షేర్లు 6శాతం లాభపడి జీవితకాల అత్యధికానికి చేరుకొన్నాయి. నవీ ముంబయిలో కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టినట్లు ప్రకటించడంతో ఈ షేర్లు లాభపడ్డాయి.
లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్లు 5శాతం పెరగడంతో అప్పర్ సర్క్యూట్ విధించారు. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ విలీనంపై వార్తలు రావడంతో ఈ షేరు ధర పెరిగింది. ఇక చక్కెర కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. రేణుకా షుగర్స్ 16శాతం, మవన షుగర్స్ 14శాతం లాభపడ్డాయి.